Sunday 27 May 2012

'రచనామౌర్య' తో ఆడి,పాడిన 'సుడిగాడు'

'రచనామౌర్య'  తో ఆడి,పాడిన  'సుడిగాడు'







వినోదం ప్రధానంగా రూపొందుతున్న ఈ  చిత్రానికి సంభందించి ఇటీవల  'నరేష్, రచనామౌర్య' ల పై 
పసందైన గీతాన్ని హైదరాబాద్  లోని ఓ పబ్ లో చిత్రీకరించారు. వాటి వివరాల్లోకి వెళితే...గీతరచయిత  రామజోగయ్య  శాస్త్రి  రచించిన  ఈ గీతానికి భాను నృత్య దర్శకత్వం వహించారు. ' గజిబిజి గతుకుల  రోడ్డులో' అంటూ సాగే ఈ గీతంలో నాయిక 'మోనాల్ గుజ్జర్' తో పాటు ప్రధాన పాత్రలు కూడా కనిపిస్తాయని దర్శకుడు తెలిపారు. దాదాపు పదిహేను కు మంది పైగా నృత్య తారలు, యాభై కి మంది పైగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఈ పాటలో పాల్గొన్నారు.
హాస్య చిత్రాల కధానాయకుడు నరేష్ , మొనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న చిత్రం 'సుడిగాడు' షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'అరుంధతి'  మూవీస్ పతాకం పై నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి , భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 'ఒకే టిక్కెట్ పై 100 సినిమాలు' అన్నది ఉప శీర్షిక. 

 'సుడిగాడు' నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ 

 నరేష్ చిత్రాలన్నీ వినోదాన్నిఅందిస్తాయి.. అయితే  ఈ 'సుడిగాడు' నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్  అందిస్తాడు. అది ఎంతో కొత్త తరహాలో ఉంటుంది. విజయ వంతమైన చిత్రాలలోని పలు ఆసక్తి కరమైన సన్నివేశాలను పేరడీ చేస్తూ, చిత్ర కధనాన్ని వినోదంతో మేళవించి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ఓల లాడించటం ఈ చిత్రం ప్రత్యేకత.
అదే ఈ 'సుడిగాడు' ను నరేష్ చిత్రాలలో  ఘన విజయం సాధించేదిగా ఉంటుందని దర్శక,నిర్మాతలు అంటున్నారు.

ఆడియో జూన్  రెండవ వారంలో విడుదల:

షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జూన్  రెండవ వారంలో ఉంటుంది. అదే నెలాఖరులోగా చిత్రాన్ని విడుదల చేయాలన్న దిశగా  నిర్మాణ కార్య క్రమాలు జరుగు తున్న్నాయని నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి అన్నారు.

'సుడిగాడు' కు మూలకధ: అముదన్; రచనా సహకారం: అనిల్,నారాయణ,హరి,గోపి; సంగీతం: శ్రీవసంత్; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, భీమనేని రోశితా సాయి; కెమేర: విజయ్ ఉలఘనాధన్; ఎడిటింగ్: గౌతంరాజు; ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: చంద్రశేఖర్.డి.రెడ్డి; కధ-మాటలు-స్క్రీన్ ప్లే - దర్శకత్వం; భీమనేని శ్రీనివాసరావు.

















No comments:

Post a Comment